తెలుగులో ఒకప్పుడు దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి ఎంతోమందికి కలలరాణి గా నిలిచిపోయిన ప్రముఖ నటి శ్రీదేవి గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రస్తుతం శ్రీదేవి భౌతికంగా తన అభిమానుల మధ్య లేకపోయినప్పటికీ తన సినిమాల రూపంలో మాత్రం ఎప్పటికీ బాగానే అలరిస్తోంది.
అయితే శ్రీదేవి మరణానంతరం తన కూతురు జాన్వీ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించడంతో వరుసగా సినిమా అవకాశాలు బాగానే క్యూ కట్టాయి.
కానీ ఆశించిన స్థాయిలో ఈ అమ్మడికి తన తల్లి మాదిరిగా స్టార్డమ్ మాత్రం రావడం లేదు.దీంతో సినిమా పరిశ్రమలో తన తల్లి పేరు నిలబెట్టేందుకు జాన్వీ కపూర్ తీవ్రంగా శ్రమిస్తుంది.
అయితే ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్ సినిమాల్లో నటిస్తూనే మరో పక్క పలురకాల ఫోటో షూట్లు మరియు మ్యాగజైన్ షూట్లలో కూడా బాగానే పాల్గొంటోంది.కాగా తాజాగా ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని బికిని దుస్తులు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
అంతేగాక మొన్నటికి మొన్న తన స్నేహితులతో కలిసి బీచ్ లో బికినీ దుస్తులు వేసి ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.దీంతో ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్ సినిమా అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచిందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇటీవలే జాన్వీ కపూర్ హిందీలో ప్రముఖ హీరో రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన “రూహి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు “దోస్తానా 2” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అంతే కాకుండా ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “గుడ్ లక్ జెర్రీ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను కూడా సురక్షితంగా ఉంచండి.– తెలుగు స్టాప్.కామ్ యాజమాన్యం
.