స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జీవితంలో మర్చిపోలేని దోశ రుచి చూశాడు.అదేంటి ఎందుకంత స్పెషల్ గా ఆ దోశ గురించి చెప్పాడు అంటే అది తన గారాలపట్టి అల్లు అర్హ స్వయంగా వేసి ఇచ్చిన దోశ కాబట్టే బన్నీ అంత స్పెసిఫిక్ గా చెప్పాడు.
ఈమధ్యనే కరోనా పాజిటివ్ రావడంతో అల్లు అర్జున్ హోం క్వారెంటైన్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే.ఈ టైం లో అతనికి కావాల్సినవన్ని ఇంట్లో వారే చేసి ఇస్తున్నారు.
అయితే తండ్రి మీద ప్రేమతో అల్లు అర్హ బన్నీకి స్పెషల్ దోశ చేసి ఇచ్చింది.ఆ వీడియోని షేర్ చేసి తన కూతురు వేసి ఇచ్చిన ఈ దోశ జీవితంలో మర్చిపోలేనంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.
అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ టైం లో రాములా రాములా పాటకి దోశ స్టెప్ అంటూ అల్లు అర్జున్ స్టెప్ ను ఎగతాలి చేసింది అల్లు అర్హ. ఏది ఏమైనా కూతురు చేసిచ్చిన దోశ తిన్న బన్నీ డబుల్ ఎనర్జీతో కరోనాని త్వరగా జయించాలని ఆశిద్దాం.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నాడు.సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు బన్నీ.