కరోనా వారియర్ గా సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసుని చాటుకుంటున్నాడు.కరోనా టైం లో ఆపద అని తెలిసిన వెంటనే ప్రభుత్వాల కన్నా సోనూ సూద్ స్పందిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ టైం లో కూడా సోనూ సూద్ చేస్తున్న సహాయాన్ని అందరు ప్రశంసిస్తున్నారు.ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్, బెడ్స్ లేక ఇబ్బందులు పడుతున్న సమాన్యులకు తన వంతు సాయాన్ని అందిస్తున్నారు సోనూ సూద్.
ఇక రీసెంట్ గా బెంగుళూరులో సోనూ సూద్ అండ్ టీం చేసిన సాయం వల్ల 22 మంది కోవిడ్ బారి నుండి బయటపడ్డారు.ఈ విషయం తెలుసుకున్న తమిళ హీరో మాధవన్ తన ట్విట్టర్ ద్వాతా సోనూ సూద్ ను అభినందించారు.
22 మందిని కోవిడ్ బారి నుండి కాపాడిన సోనూ సూద్ కు అతని టీం కు ఆ దేవుడి దయ ఎప్పుడూ ఉండాలని మాధవన్ అన్నారు.అంతేకాదు నువ్వు ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నావని అన్నారు మాధవన్.
కరోనా టైం లో సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆయనకు స్టార్ హీరోల కన్నా గొప్ప మనసని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.స్టార్ హీరోలు విరాళాలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటుంటే సోనూ సూద్ మాత్రం ఆపద అనగానే అక్కడ కావాల్సిన ఏర్పాట్లను చేస్తూ అందరు హృదయాలను గెలుస్తున్నాడు.