అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. సెకండ్ వేవ్ మొదలు అయిన తర్వాత కూడా షూటింగ్ ను జరిపారు.
కాని అల్లు అర్జున్ తో పాటు ఇతర యూనిట్ సభ్యులకు కరోనా పాజిటివ్ అంటూ తేలడంతో షూటింగ్ ను మరో రెండు మూడు రోజులు పూర్తి చేయడం జరిగింది. షూటింగ్ ను పూర్తి చేయాలని సుకుమార్ హడావుడిగా ఉన్న సమయంలో అనూహ్యంగా కరోనా వల్ల మొత్తం తలకిందులు అయ్యింది.
దాదాపుగా రెండు ఏళ్ల క్రితం ఈ సినిమా ను ప్రకటించారు.అప్పటి నుండి సినిమా బడ్జెట్ పెరిగి పోతూనే ఉంది.
ఈ సినిమా షూటింగ్ ను ఎప్పటి కప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు.కనుక బడ్జెట్ భారీగా పెరిగిందనే వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కోసం ప్రముఖ నటీ నటులను ఎంపిక చేయడం జరిగింది.వారు కనుక షెడ్యూల్ మిస్ అయితే మళ్లీ డేట్లు దక్కించుకోవడం కోసం కష్టపడాలి.అలా డేట్లు కావాలంటే పారితోషికం మళ్లీ మళ్లీ ఇవ్వాల్సి వస్తుంది.దాంతో ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ పునః ప్రారంభించిన సమయంలో డేట్లు కావాలంటే పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది.
అలా ఈ సినిమా బడ్జెట్ పెరిగి పోతుందనే ఆందోళన మైత్రి మూవీ మేకర్స్ అంటున్నారు.సుకుమార్ కూడా ఈ విషయంలో కాస్త ఆందోళనగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ కు బడ్జెట్ శృతి మించితే ఆ భారం సుకుమార్ మీద పడుతుంది.అందుకే తక్కువ సమయంలో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కూడా సాధ్యం అవ్వడం లేదు అంటున్నారు.
కరోనా కారణంగా షూటింగ్ జరగడం లేదు అంటూ పుష్ప మేకర్స్ ప్రస్తుతం షూటింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.