తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ లతో కట్టడి చేసే పరిస్థితి లేదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.అసలు తెలంగాణలో కరోనా కట్టడి కోసం.
ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అన్నదానిపై హైకోర్టు.నిలదీసింది.కేవలం రాత్రిపూట కర్ఫ్యూలు మాత్రమే కాక వీకెండ్ లాక్ డౌన్ కూడా అమలు చేయండి అని ప్రభుత్వానికి సూచనలు ఇచ్చింది.8వ తేదీ కంటే ముందే ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి డేడ్ లైన్ పెట్టింది.రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై న్యాయస్థానం విచారణ చేసిన క్రమంలో.రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి.డిహెచ్ శ్రీనివాస రావు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ భయంకరంగా విజృంభిస్తున్న గాని కనీసం రోజుకి లక్ష కరోనా టెస్ట్ లు ఎందుకు చేయటం లేదని కోర్టు ప్రశ్నించింది.
కేవలం రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తే సరిపోదు.లాక్ డౌన్ అమలు చేయాలని.
ఈ విషయంపై ప్రభుత్వ నిర్ణయం ఎనిమిదో తారీకు లోపు తెలపాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
.