దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలో గెలవటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.బీజేపీ పార్టీకి చెందిన కీలక నేతలు.
సంవత్సరం నుండి బెంగాల్లో మకాం వేసిన గాని భారీ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం జరిగింది.అయితే గత సంవత్సరం నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరియు బిజెపి పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో పరిస్థితులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఊహించని విధంగా భారీ మెజార్టీతో మమతా బెనర్జీ పార్టీ గెలవడంతో బెంగాల్ రాష్ట్రంలో చాలా చోట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు బీజేపీ ప్రభావిత ప్రాంతాలపై దాడులకు తెగబడడం జరిగింది.
ఏకంగా ఇళ్ళల్లో నుండి బిజెపి పార్టీకి చెందిన కార్యకర్తలని బయటకు లాక్కొచ్చి మరి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టడంతో బెంగాల్ రాష్ట్రంలో బిజెపి పార్టీ క్యాడర్ బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో.దేశంలో ఇతర రాష్ట్రాలలో ఉన్న బీజేపీ నేతలు వెంటనే కేంద్రం.బెంగాల్ రాష్ట్రంలో బిజెపి నాయకులను కాపాడుకునే విధంగా మిలటరీ బలగాలను దింపాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాలలో కూడా బిజెపి నాయకులు నినాదాలు చేస్తూ ఉన్నారు.
బెంగాల్ రాష్ట్రంలో బిజెపి పార్టీ నేతల పై జరుగుతున్న దాడుల విషయంలో కేంద్రం ఎంటర్ కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
.