తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం తేలింది.ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్పుర్ జిల్లా బక్షాలో పంచాయతీ ఎన్నికల బరిలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ దీక్ష పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఎన్నిక ల రిజల్ట్స్ రాగా ఆవిడకు కేవలం రెండు వేల ఓట్లు పోల్ అవడంతో ఏకంగా ఐదో స్థానంలో నిలిచింది.
ఇక ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసిన నాగిన సింగ్ మొత్తంగా ఐదు వేల ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించాడు.
దీక్షా మహిళల సంక్షేమం, మౌలిక వసతులు కల్పన లాంటి ప్రధాన అంశాలను తన అస్త్రంగా చేసుకొని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన గాని చివరికి దీక్ష సింగ్ జిల్లా పంచాయతీ పదవిని చేజిక్కించుకోలేకపోయారు.ఇక దీక్ష తన బాల్యంలోనే వారి కుటుంబం జౌన్పుర్ జిల్లా బక్షా ప్రాంతంలోని చిట్టోరీ గ్రామం నుండి ముంబైకి వలస వచ్చారు.
ఇక 2015 లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో దీక్ష పాల్గొని ఆ సంవత్సరానికి రన్నరప్ గా నిలిచింది.ఆ తర్వాత ఆవిడ కొన్ని బాలీవుడ్ సినిమాలలో, అలాగే మరికొన్ని వాణిజ్య ప్రకటనలలో కూడా ప్రేక్షకులను అలరించింది.
ఈవిడ కేవలం నటన మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ రాయడం లోనూ తన ప్రతిభను కనపరిచింది.