ముచ్చటగా మూడోసారి బెంగాల్ రాష్ట్రానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సీఎం అయ్యారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారీ స్థాయిలో మెజార్టీ స్థానాలు గెలవడంతో మమతా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్తంగా విజృంభిస్తుండడంతో.కేవలం కొద్ది మంది సమక్షంలోనే మూడోసారి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగేలా దీదీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది.
ఈ క్రమంలో మరో రాష్ట్రానికి చెందిన ఏ ముఖ్యమంత్రిని కూడా పిలవకూడదు అని మమత డిసైడ్ అయిందట.
కోవిడ్ నిబంధనల మధ్యే.
కలకత్తా లోని రాజ్ భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.కోల్కతాలోని స్టేట్ సెక్రటరీ వద్ద విఐపి ఎంట్రీ దగ్గర మమతకు గాడ్ ఆఫ్ ఆనర్ నిర్వహించనున్నారు.
గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న బుద్ధదేవ్, అబ్దుల్… సిపిఎం నాయకులకు మమతా ఆహ్వానం పంపించడం జరిగిందట.కరోనా భయంకరంగా విజృంభిస్తుండటంతో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మరియు మరో పార్టీకి చెందిన నాయకులను మమతా ఆహ్వానించలేదని సమాచారం.
ఇదిలా ఉంటే బీసీసీఐ అధ్యక్షుడు.సౌరవ్ గంగూలీ కి ప్రత్యేకమైన ఆహ్వానం పంపారట.
అదేరీతిలో తృణమూల్ ఎంపీ అభిషేక్.ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరుకానున్నారట.
.