సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే ఆశామాషీ విషయం కాదు.ఎందుకంటే సినిమా పరిశ్రమ అంటే పోటీ పరిశ్రమ.
అవకాశాలు రావాలంటే తప్పక సినిమా కుటుంబానికి చెందిన వారై ఉండాలనే ఒక పెద్ద అపోహ ఉంది.కాని ఇది ఇప్పటికి అపోహగానే మిగిలి పోయింది.
అయితే హీరోయిన్ గా చాలా ఏళ్ళు అవకాశాలు సంపాదించుకొని నిలదొక్కుకోవాలంటే అందంతో పాటు అభినయం కలగలిసి ఉండాలి, అప్పుడే పాత్రల రూపంలో ప్రేక్షకుల గుండెల్లో కలకాలం నిలిచిపోతారు.ప్రస్తుతం సినిమా పరిశ్రమలో అందంతో పాటు కలగలిసిన హీరోయిన్ లను వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు.
అందులో ముందు వరుసలో ఉంటారు నటి త్రిష.సినిమా పరిశ్రమలో స్నేహితురాలి పాత్రలతో చాలా సినిమాలలో నటించింది.ఆ తరువాత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం, సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇక స్నేహితురాలి పాత్రలకు స్వస్తి చెప్పి హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది.తాజాగా నటి త్రిషపై ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అయితే త్రిష స్నేహితురాలి పాత్రలు వేస్తూనే అప్పట్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుందట.అయితే త్రిష మొదటి సినిమా రెమ్యునరేషన్ ను చూస్తే చిరంజీవిని మించిపోయిందని వార్త వైరల్ అవుతోంది.
త్రిష మొదటి సినిమాకే 500రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట.అప్పట్లో 500 అంటే చాలా పెద్ద రెమ్యునరేషన్.
కాని చిరంజీవి మొదట నటించిన రెండు సినిమాలు రెమ్యునరేషన్ లేకుండా చేసి మూడో సినిమాకు 1118 రూపాయల పారితోషికం తీసుకున్నాడు.ఈ లెక్కన చూస్తే త్రిష చిరంజీవినే మించి పోయిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.