టాలీవుడ్ లో స్టార్ హీరోలు రెమ్యునరేషన్ వింటే కళ్ళు చెదిరి పోవాల్సిందే.ఒక్కొక్కరు తమ మార్కెట్ కు తగ్గట్టు రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు.
అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన మార్కెట్ కు తగ్గట్టు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారు.అయితే ఈయన డైరెక్ట్ గా కాకుండా లాభాల్లో 20 శాతం వాటాతో పాటు నం థియేట్రికల్ రైట్స్ ను తీసుకుంటాడనే టాక్ ఉంది.
అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఇలాంటి చేసుకోవడానికి వీలు లేక ఇప్పుడు డైరెక్ట్ రెమ్యునరేషన్ తీసుకునేందుకు రెడీ అయ్యాడని సమాచారం.మహేష్ తన కొత్త సినిమాను ఈ మధ్యనే అనౌన్స్ చేసాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రాబోతుంది.వీరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.
అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అయితే వీరి కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.
ఈ సినిమాకు మహేష్ తీసుకోబోయే రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాకు మహేష్ దాదాపు 60 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది.ఈ విషయంలో నిజమెంతో తెలియదు కానీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఈ సినిమాను త్రివిక్రమ్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించ బోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాను హాసిని అండ్ హారిక బ్యానర్ నిర్మిస్తుంది.అయితే ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ రెండు సినిమాలతో పాటు మహేష్ రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.