దేశవ్యాప్తంగా కరోనా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విషయం తెలిసిందే.ఇక కోవిడ్ సెకండ్ వేవ్ ఇంతలా వ్యాపించడానికి మాత్రం ప్రజల నిర్లక్ష్యం, పాలకుల అధికార దాహం అని ప్రజల్లో చర్చ సాగుతుందట.
అసలు ఎన్నికలు పెట్టకుంటే ఈ కరోనా ఇంతలా విజృంభించేది కాదంటున్నారు.
ఇకపోతే ఈ కరోనా వల్ల ప్రజలందరు ఇంటికే పరిమితం అయ్యి ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని పొందలేకుండా, అయిన వారిని కూడా పరాయి వారిలా చూస్తూ బ్రతికేలా చేసింది.
ఇక కోవిడ్ వైరస్ వల్ల ఇప్పటికే పలు ప్రముఖ ఆలయాలన్ని భక్తుల దర్శనాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుని కోవిడ్ నిబంధలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే నగరంలోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాలను మూసివేయాలని ఆయా ఆలయాల అధికారులు నిర్ణయించారట.
నేటి నుంచి సాధారణ, ప్రత్యేక దర్శనాలతోపాటు అన్ని సేవలను నిలిపివేస్తున్నట్టు పెద్దమ్మతల్లి ఆలయ అధికారులు తెలిపారు.కానీ అంతరాలయంలో నిత్య పూజలు మాత్రం జరుగుతాయని స్పష్టం చేశారు.
ఇకపోతే బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయాన్ని కూడా నేటి నుంచి ఈ నెల 1
.