ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పార్టీ భారీ స్థాయిలో గెలిచిన సంగతి తెలిసిందే.దాదాపు పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడంతో.
డీఎంకే పార్టీకి చెందిన కార్యకర్తలు తమిళనాడులో రెచ్చిపోతున్నారు.జయలలిత కి సంబంధించిన ఫోటోలు మరియు అమ్మ క్యాంటీన్ లపై విధ్వంసం సృష్టిస్తున్నారు.
అమ్మ క్యాంటీన్ లో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేస్తూ అడ్డుకుంటున్న పోలీస్ లపై కూడా.దాడికి తెగబడుతున్నారు.
దీంతో తాజా పరిస్థితులపై తమిళనాడులో సామాన్య జనం.అధికారం ఇస్తే ఈ విధంగా రెచ్చిపోతే ఎలా అంటూ డీఎంకే పార్టీ కార్యకర్తల పై మండి పడుతున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో క్లిష్ట సమయంలో పేద వారికి ఎంతో ఉపయోగపడే అమ్మ క్యాంటీన్ లపై ఈ రీతిగా దాడి చేయడం దారుణమని ఖండిస్తున్నారు.ఏది ఏమైనా తమిళనాడు రాష్ట్రంలో దాదాపు పది సంవత్సరాల తర్వాత డీఎంకే పార్టీ అధికారంలోకి రావడంతో.
అక్కడ సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.