హైదరాబాద్ జూ పార్క్ లోని ఎనిమిది సింహాలకు కరోనా వచ్చిందన్న వార్త హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ వార్తలపై స్పందిచారు జూ నిర్వాహకులు.
నెహ్రూ జూ పార్క్ లో 8 సింహా లకు కరోనా లక్షణాలు కనిపించడంలో ఏప్రిల్ 24న వాటి శాంపిల్స్ ను పరీక్షలకు సీసీఎంబీకి పంపించారు.అయితే వాటికి వైరస్ వచ్చిన విషయం నిజమే కాని అది కరోనా కాదని తేలిందట.
సింహాలకు సోకిన వైరస్ ను సార్స్ కొవ్ 2గా వెల్లడించారు వైద్యులు.సింహా లకు వైరస్ అనగానే మిగతా సింహా లను వాటికి దూరం చేసి ఐసోలేషన్ లో ఉంచారు.
వైరస్ ఎటాక్ అయిన సింహా లకు మాత్రం ప్రత్యేకంగా చికిత అందిస్తున్నారు.అయితే ప్రస్తుతం సింహాలు ఆరోగ్యంగానే ఉన్నట్టు చెబుతున్నారు జూ అధికారులు.
సింహాలు ఆహారాన్ని కూడా తీసుకుంటున్నాయని చెప్పారు.కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా జూ లు అన్ని మూసేసిన విషయం తెలిసిందే.
అయితే హైదరాబాద్ లో సింహాలకు కూడా కరోనా అనగానే న్యూస్ వైరల్ గా మారింది.అయితే వాటికి వచ్చింది కరోనా కాదని సార్స్ కొవ్ 2 అని తెలియచేశారు.
జూ మూసి ఉంది కాబట్టి ప్రజలెవరికి ఆ సింహాల వైరస్ ల వల్ల ప్రమాదమేమి లేదని వెల్లడించారు.