సూపర్ స్టార్ మహేష్ బాబు గత సంవత్సరం సంక్రాంతికి రిలీజైన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి గురించి పరశురామ్ ఈ సినిమాలో చూపించ బోతున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.మహేష్ ఈ సినిమా తర్వాత రాజమౌళి తో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ఫిక్స్ అయ్యింది.
అయితే రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ లోపు మహేష్ మరొక సినిమా ప్లాన్ చేసాడు.త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు.
వీరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అయితే వీరి కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.అయితే వీరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాను ఒక రేంజ్ లో తీయబోతున్నాడని సమాచారం.
ఈ సినిమాను త్రివిక్రమ్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించ బోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాను హాసిని అండ్ హారిక బ్యానర్ నిర్మిస్తుంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి లేటెస్ట్ బుజ్ వినిపిస్తుంది.ఈ సినిమా టైటిల్ గురించిన వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అతడు సినిమాలో మహేష్ బాబు పోషించిన పాత్ర పేరు కూడా పార్థు.ఇప్పుడు ఇదే పేరు ను ఈ సినిమాకు త్రివిక్రమ్ పరిలీసిస్తున్నాడని టాక్ నడుస్తుంది.
మరి చూడాలి చివరకు ఈ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ అవుతుందో.