తాజాగా అపెండిసైటిస్ బాధతో ఆసుపత్రిలో చేరిన పంజాబ్ కింగ్స్ టీం జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కి సోమవారంనాడు విజయవంతంగా సర్జరీ పూర్తయింది.తీవ్రమైన కడుపు నొప్పితో రాహుల్ ఆదివారం నాడు ఆసుపత్రిలో చేరగా పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్ అని నిర్ధారణ చేయడంతో వెంటనే కేఎల్ రాహుల్ కి శస్త్ర చికిత్స చేయించారు.
అయితే శస్త్ర చికిత్స ముందు అనుకున్న విధంగానే కె.ఎల్.రాహుల్ కోల్పోవడానికి అనేక వారాల సమయం అవసరం లేదని.కేవలం 7 రోజుల తర్వాత అతడు తన కార్యకలాపాలను ఇది వరకు ఎలా చేసుకుంటున్నాడో అలా చేసుకోవచ్చని డాక్టర్లు తెలియజేశారు.
అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో భాగంగా కె.ఎల్.రాహుల్ లో తిరిగి ఐపీఎల్ బయో బబుల్ లోకి అనుమతించడం పై పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఐపిఎల్ అధికారులతో చర్చలు జరుపుతోంది.
ఇందుకోసం కేఎల్ రాహుల్ ఐపీఎల్ యాజమాన్యం నిర్దేశించిన నిర్దేశిత హోటల్ లో వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
దీంతో అతను మరో రెండు వారాల్లో తిరిగి జట్టుతో కలిసే అవకాశాలు లేకపోలేదు.అయితే మొదటగా అపెండిసైటిస్ అని తెలియడంతో ఈ లీగ్ నుండి కె.ఎల్.రాహుల్ దూరమైనట్లు అని అందరూ భావించారు.కాకపోతే, వారం రోజుల్లో కోలుకుంటాడని వైద్యులు చెప్పడంతో ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం కేఎల్ రాహుల్ రికవరీకి ప్రయత్నాలు చేస్తోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భాగంగా పలు పరీక్షలు చేసిన తర్వాతనే కె.ఎల్.రాహుల్ ఐపీఎల్ లోకి మళ్లీ ప్రవేశించాలన్న ఆ తర్వాత జట్టుతో కలిసి అనేక పరీక్షలు చేయాల్సి ఉంది.ఇకపోతే కేఎల్ రాహుల్ దీంతో లేకపోవడంతో ఆ జట్టు బాధ్యతలను చేపట్టబోతున్నాడు.ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సిరీస్ లో భాగంగా నేడు మ్యాచ్ లలో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ 331 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.
ఈ సీజన్ లో కె.ఎల్.రాహుల్ ఇప్పటివరకు నాలుగు హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు.