సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మరికాసేపట్లో కేబినెట్ భేటీ సమావేశం కానుంది.వెలగపూడి సచివాలయం లో ఉదయం పదకొండున్నర గంటలకు ఈ సమావేశం స్టార్ట్ కానుంది.
గతంలో రెండు సార్లు క్యాబినెట్ భేటీ వాయిదా పడుతూ వస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం జరిగాయి.పరీక్షలు రద్దు చేయటం కాకుండా క్యాబినెట్ భేటీ రద్దు చేసుకుంటూ తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు.
పిల్లల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారు అని విమర్శలు చేశారు.
ఇలాంటి తరుణంలో నేడు జరగనున్న కేబినెట్ భేటీలో రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి అదేవిధంగా విద్యా వ్యవస్థ విషయంలో కీలక నిర్ణయాలు కోవిడ్ నియంత్రణ వ్యాక్సినేషన్ పంపిణీ, కర్ఫ్యూ ఇంకా అనేక విషయాల గురించి మంత్రి మండలి సమావేశం చర్చించనున్నట్టు సమాచారం.
అదే విధంగా వైజాగ్ భోగాపురం విమానాశ్రయం గురించి మరియు జగనన్న కాలనీలకు సంబంధించి భూ కేటాయింపులు ఈ విషయం గురించి జరగబోయే క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
.