కరోనా నింపిన విషాదం.. కేంద్రమంత్రి కూతురు మృతి.. !

కరోనా ప్రజల పాలిట యమపాశంగా మారింది.ఇప్పటికే ఏ మాత్రం అనారోగ్య సమయలున్నా కోవిడ్ సోకిందంటే దాదాపుగా బ్రతికి బట్టకట్టడం కష్టంగా మారుతుంది.

 Central Minister Gehlot Daughter Yogita Solanki Died Of Corona, Union Minister,-TeluguStop.com

అదీగాక వయస్సు మళ్లిన వారితో పాటుగా, మిడిల్ వయస్సు వారిని కూడా ఇబ్బంది పెడుతున్న కరోనా వల్ల ఎందరో రాజకీయ ప్రముఖులే కాదు, సామాన్య ప్రజలు కూడా మృత్యువాత పడుతున్నారు.

ఇకపోతే తాజాగా కరోనా మహమ్మారి బారినపడిన కేంద్రమంత్రి గెహ్లాత్ కూతురు యోగితా సోలంకి(44) ప్రాణాలు కోల్పోయారు.

కాగా రెండు వారాల క్రితం కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న యోగితాను ఉజ్జయినిలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారట.అక్కడ చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే పరిస్దితి విషమించడంతో ఆమెను హుటాహుటిన ఇండోర్‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించారట.

అక్కద కూడా ఇదే పరిస్దితి ఎదురవడం, అంతలోనే గుండెపోటు రావడం తో సోమవారం మధ్యాహ్నం ఆమె కన్నుమూశారని స్వయంగా కేంద్రమంత్రే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube