పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ముగిసాయని అనుకుంటున్న సమయంలో వీటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది.ఇక ఆ ఫలితాలు కూడా వచ్చాయి.
ఈ ఫలితాల్లో నందిగ్రామ్లో మమతా గెలుపొందినట్టు మొదట ప్రకటించినా.రీకౌంటింగ్ చేపట్టడంతో సువేందు విజయం సాధించినట్టు ఈసీ ప్రకటించింది.
దీంతో ఇక్కడే చిచ్చు రాజుకుంది.ఇప్పటికే సువేందు పై దాడి జరగగా అదికాస్త ముదిరి ఒకరి మీద ఒకరు తీవ్రమైన హింసకు దారితీసింది.ఈ నేపధ్యంలో అసెంబ్లీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి బీజేపీకి చెందిన కనీసం ఆరుగురు కార్యకర్తలు మరణించారని, పార్టీ కార్యాలయాలపై దాడులు పెరిగాయని ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఆరోపించింది.
ఈ ఘటన పై స్పందించిన కేంద్ర హోంశాఖ ఈ హింసకు సంబంధించిన నివేదిక వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోవైపు ఆ రాష్ట్ర గవర్నర్ సైతం దీనిపై స్పందించారు.ఇకపోతే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినప్పటి నుండి తృణముల్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆ వివాదం చివరికి హింసకు దారితీసింది.