టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు.కరోనా సెకండ్ వేవ్ తీవ్రత బాగా ఉన్న నేపథ్యంలో ఈ టైం లో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు.
కరోనా వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు ఉంటే వారికి అండగా నేను నా టీం ఉంటామని వారికి కావాల్సిన అన్ని అవసరాలను రెండేళ్ల పాటు చూస్తామని అన్నారు సందీప్ కిషన్.అలాంటి వారి ఇన్ఫర్మేషన్ ను తనకు ఇవ్వవల్సిందిగా ఓ ఈమెయిల్ ఐడిని సోషల్ మీడియాలో పెట్టారు సందీప్ కిషన్.
అంతేకాదు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఇళ్ల దగ్గరే ఉండండి.సేఫ్ గా ఉండండి మీకున్న దానిలో అవసరం ఉన్న వారికి సాయం చేయండి అంటూ మెసేజ్ పెట్టాడు సందీప్ కిషన్.
సందీప్ కిషన్ చేస్తున్న ఈ పనితో నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.హీరోగా కెరియర్ లో వెనకపడ్డా సరే మంచి పని చేయడానికి నేను ముందుంటానని వచ్చాడు సందీప్ కిషన్.
ఈమధ్యనే ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్.ఎంచుకున్న కంటెంట్ బాగున్నా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయడంలో వెనకపడుతున్నాడు సందీప్ కిషన్.
సినీ కెరియర్ ఎలా ఉన్నా తను చేస్తున్న మంచి పనుల వల్ల సందీప్ గురించి అందరు మాట్లాడుకునేలా చేస్తున్నాడు.