రాజు మనవాడైతే దోపిడికి అడ్డు ఉండదని తెలంగాణలో నిరూపించ బడుతుందని అనుకుంటు ఉన్నారట.అసలు మనిషి బ్రతకడానికి వేలకొద్ది ఎకరాల భూమి అవసరం లేదు.
కాని నేడు ప్రజాసేవ ముసుగులో రాజకీయాల్లో జరుగుతున్న అవినీతి మరెందులో లేదని ప్రజలందరు ముచ్చటించు కుంటున్నారట.ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూ వ్యవహారం సునామి సృష్టిస్తున్నట్లు కనిపిస్తుంది.
ఈ విషయంలో పలువురు నేతలు ఈటలకు సపోర్ట్గా మాట్లాడుతున్న విషయాన్ని గమనించే ఉంటారు.అయితే ఈటల మ్యాటర్లో తాజాగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణకే ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, రెండు ఎకరాల దేవాలయ భూములను ఆక్రమించుకుని ఆ పత్రికను ముద్రిస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్రాన్ని పాలించే ప్రభువే దొంగ అవతారమెత్తాడని, విలువైన భూములను ఆక్రమించుకున్నాడని ఫైర్ అయ్యారు.దీనికి సంబంధించిన వివరాలన్నీ సేకరించామని, త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.