ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికీ స్మార్ట్ ఫోన్ ద్వారా అందరికి ఇట్లే తెలిసిపోతుంది.సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సంఘటన పై కధనాలు వైరల్ అవుతున్న ఉండడం మనం చూస్తూనే ఉంటాం.
అలాగే ఒక ఫ్లైట్ లో నిండు గర్భిణీ ప్రసవించిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే… పసిఫిక్ మహా సముద్రం మీద ఒక విమానం ప్రయాణం కొనసాగిస్తోంది.
అందులోని కొందరు ప్రయాణికులు ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ, ఇద్దరు ఎయిర్ హోస్టర్స్ మాత్రం కంగారు పడొద్దు అటూ ఇటూ పరుగులు పెట్టారు.అది చూసిన ప్రయాణికు లందరూ కూడా ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అర్థం కాక ఆందోళనలో ఉన్నారు.
కానీ ఇంతలో ఆ ఇద్దరు ఎయిర్ హోస్టర్స్ ఫ్లైట్ లో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా అని అడిగారు.ఈ క్రమంలో అనుకోకుండా ఒక్కసారిగా విమానంలో ఒక పసికందు ఏడుపు ప్రయాణికుల అందరికీ వినిపించింది.
దీనితో ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.అంత ఎత్తులో ఉన్న సమయంలో అప్పుడే పుట్టిన పసి బిడ్డ ఏడుపు ఎలా వినిపించింది అర్థంకాక ప్రయాణికులు ఆందోళనలో పడ్డారు.
అయితే అంతలోపు అసలు విషయం తెలియజేశారు ఆ ఎయిర్ హోస్టర్స్.డెల్టా ఫ్లైట్ లో ఒక నిండు గర్భిణీ ప్రయాణిస్తుందని, ఫ్లైట్ సరిగ్గా పసిఫిక్ మహా సముద్రం మీద ప్రయాణం చేస్తుండగా, ఆ గర్భిణీ నొప్పులు మొదలయ్యాయి, దీనితో డాక్టర్ కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో నిండు గర్భిణీ డెలివరీ అయిదని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం వారిద్దరు క్షేమంగా ఉన్నారని ఎయిర్ హోస్టర్స్ తెలియజేశారు.ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.