చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వరుస విజయాలతో యూత్ లో ఉదయ్ కిరణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పాటు రెమ్యునరేషన్ కూడా పెరిగింది.బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న ఉదయ్ కిరణ్ ఒక దశలో వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.
ఎంత వేగంగా ఉదయ్ కిరణ్ కు క్రేజ్ పెరిగిందో అంతే వేగంగా ఈ హీరోకు క్రేజ్ తగ్గుతూ వచ్చింది.
సీనియర్ డైరెక్టర్లలో ఒకరైన వీరభద్రం చౌదరి తాజాగా ఉదయ్ ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను కొన్ని సంవత్సరాల క్రితం ఉదయ్ కిరణ్ తో ఒక సినిమాను ప్లాన్ చేశానని అయితే ఆ సినిమా ఆగిపోయిందని వీరభద్రం చౌదరి అన్నారు.ఆహ నా పెళ్లంట, పూల రంగడు సినిమాలతో హిట్లు కొట్టిన వీరభద్రం చౌదరి తాను 2005 సంవత్సరంలో ఉదయ్ కిరణ్ కు ఒక కథ చెబితే ఆ కథ అతనికి నచ్చిందని అన్నారు.
ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని ఆ సినిమా వల్ల ఉదయ్ కిరణ్ తో తనకు ఏర్పడిన పరిచయం వల్ల తన కథకు ఉదయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వీరభద్రం చౌదరి అన్నారు.అయితే తన కథకు ఓకే చెప్పిన సమయంలోనే ఉదయ్ కిరణ్ కు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి పిలుపు రావడంతో ఊహించని విధంగా తన సినిమా క్యాన్సిల్ అయిందని వీరభద్రం చౌదరి తెలిపారు.
ఉదయ్ కిరణ్ తో సినిమా క్యాన్సిల్ అయినప్పటికీ ఉదయ్ కిరణ్ చాలా మంచి వ్యక్తి అని వీరభద్రం చౌదరి పేర్కొన్నారు.2014 సంవత్సరం జనవరి నెల 5వ తేదీన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు వేర్వేరు కారణాలు వినిపించినా కచ్చితమైన కారణాలు తెలియలేదు.