టాలీవుడ్ యంగ్ హీరో నితిన్
ప్రస్తుతం వరుస ఆఫర్ లత దూసుకుపోతున్నాడు.చేతినిండా అవకాశాలు ఉన్న సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోతున్నాడు.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కిన ‘చెక్’ సినిమాలో నటించగా.ఈ సినిమా అంత సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.
కానీ ఈ సినిమా కంటే ముందు ‘భీష్మ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
చెక్ సినిమాతో నిరుత్సాహ పడిన నితిన్ ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ్ దే’ సినిమాపై నమ్మకం పెట్టుకున్న సంగతి తెలిసిందే.
కానీ ఈ సినిమా కూడా సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.దీంతో ప్రస్తుతం నితిన్ సినిమా కథ ఎంపిక విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు తన ఖాతాలో నింపుకుంటున్న నితిన్.బాలీవుడ్ లో మంచి విజయం అందుకున్న ‘అంధాదున్’ తెలుగు రీమేక్ ‘మాస్ట్రో’ లో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా లైన్ లో ఉండగానే కృష్ణ చైతన్య దర్శకత్వం లో ‘పవర్ పేట’ సినిమాల్లో కూడా నటించనున్నట్లు తెలిసింది.ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందట.
కానీ ఈ సినిమాను పక్కన పెట్టి ఈ సినిమా ప్లేస్ లోనే మరో సినిమాకు ఓకే చెప్పాడట.వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు ఫిక్స్ అయ్యాడట.
భారీ బడ్జెట్ తో చేసే సినిమాను పక్కన పెట్టి ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాకు నితిన్ ఓకే చెప్పడం ఏంటో అర్థం కాకపోగా.మొత్తానికి వంశీతో చేసే సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.
ఇక ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఉన్న నితిన్ ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాల్సిందే.