కేసీఆర్ అపారమైన రాజకీయ అనుభవం కలిగిన అపర చాణక్యుడు అనే విషయం మనకు తెలిసిందే.అయితే కేసీఆర్ తీసుకునే నిర్ణయం వెనుక ఏదో ఒక వ్యూహం దాగి ఉంటుంది.
ఏవైతే కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నింటిని ఒక్క గూటికి చేర్చి ఒకే ఒక అస్త్రంతో వాటికి చెక్ పెడతారు.అలా ఇప్పుడు ఎమ్మెల్యే ఈటెల విషయంలోనూ ఇదే జరిగిందని తెలుస్తోంది.
సాధారణంగా ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శించడం చాలా సహజం.కాని సొంత పార్టీ నేతలే ప్రతిపక్ష పార్టీ తరహాలో విమర్శలు గుప్పిస్తే పార్టీ అధినేత ఆగ్రహానికి గురి కాక తప్పదు.
ఎమ్మెల్యే ఈటెల బహిరంగ వేదికల పైనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఈటెల అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాడు.అయితే ఇలాంటి ఈటెల లాంటి నాయకులు కొద్ది మంది ఉన్నట్టు కేసీఆర్ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది.
వారు బహిరంగంగా ఈటెల తరహాలో మాట్లాడకపోయినా ఎక్కడ డ్యామేజ్ చేయాలో అక్కడ డ్యామేజ్ చేస్తూ వస్తున్నారట.అయితే వారందరికీ ఈటెల విషయంలో కఠినంగా చర్యలు తీసుకొని, వారికి కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పకనే చెప్పారు కేసీఆర్.
మరి ఈటెల వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందనేది చూడాల్సి ఉంది.