పవన్ కళ్యాన్ వకీల్ సాబ్ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా కరోనా సెకండ్ వేవ్ మొదలై మొత్తం తలకిందులు చేసింది.150 కోట్ల వసూళ్లు వస్తాయని ఆశిస్తే 80 నుండి 85 కోట్ల వరకు మాత్రమే వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.పెద్ద ఎత్తున వకీల్ సాబ్ సినిమా ను విడుదల చేసి భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్నారు.కాని ఆ తర్వాత సినిమా వసూళ్ల విషయంలో వెనుకబడింది.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్ల కు జనాలు వెళ్లడం తగ్గించారు.దాంతో వకీల్ సాబ్ వసూళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి.
వకీల్ సాబ్ ను అమెజాన్ ప్రైమ్ లో వెంటనే స్ట్రీమింగ్ చేయడం ద్వారా లాభం పొందాలని భావించారు.అదనంగా దాదాపుగా 12 కోట్ల రూపాయలను అమెజాన్ నుండి తీసుకున్న దిల్ రాజు సినిమాను ముందస్తు స్ట్రీమింగ్ కు అనుమతించాడు.
అమెజాన్ లో స్ట్రీమింగ్ కోసం పవన్ అభిమానులు ఎదురు చూశారు.వకీల్ సాబ్ అమెజాన్ లో స్ట్రీమింగ్ ను భారీ ఎత్తున ప్రచారం చేశారు.అయితే స్టార్ హీరో సినిమా అవ్వడం వల్ల ఎక్కువ మంది థియేటర్ లో చూశారు.కొందరు పైరసీ కూడా ముందే చూసినట్లుగా ఉన్నారు.
అందుకే అమెజాన్ వారు ఆశించిన స్థాయిలో వకీల్ సాబ్ కు రన్ టైమ్ రావడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి వకీల్ సాబ్ సినిమా థియేటర్లలో కరోనా వల్ల కాస్త పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు రాబట్టినా కూడా అమెజాన్ లో మాత్రం పైరసీ ఇతరత్ర కారణాల వల్ల వ్యూ కౌంట్ తక్కువగా ఉందని అంటున్నారు.
రికార్డు బ్రేకింగ్ వ్యూస్ రన్ టైమ్ మాత్రం సినిమాకు దక్కలేదు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ లో పవన్ కు జోడీగా శృతి హాసన్ నటించగా కీలక పాత్రలో నివేథా థామస్, అంజలి మరియు అనన్య లు నటించారు.