దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో కచ్చితంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు పోటీ చేస్తూ ఉంటారు.సినిమా రంగంలో అవకాశాలు తగ్గిన తరువాత రాజకీయాల్లోనైనా సత్తా చాటాలని కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తే మరి కొందరు మాత్రం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతారు.
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు పోటీ చేశారు.
ప్రముఖ నటులలో ఒకరైన సురేష్ గోపీ బీజేపీ పార్టీ తరపున కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.మొదట సురేష్ గోపీ ఆధిక్యం కనబరిచినా ఆ తరువాత మూడో స్థానానికి పరిమితమయ్యారు.
తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులైన చాలామంది సెలబ్రిటీలు పోటీ చేశారు.
డీఎంకే పార్టీ తరపున స్టాలిన్ కుమారుడు, ప్రముఖ నటుడు ఉదయనిధి స్టాలిన్ పోటీ చేసి విజయం సాధించారు.
చెపాక్ డివిజన్ నుంచి పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్ ఏకంగా 60 వేల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం.గతంలో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసిన ఖుష్బూ బీజేపీ పార్టీ నుంచి థౌజండ్ లైట్స్ డివిజన్ నుంచి పోటీ చేశారు.
ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా ఈమె ఓటమిపాలయ్యారు.
తమిళనాడులో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.కమల్ హాసన్ గెలుస్తాడని అతని ఫ్యాన్స్ భావించినా ఫలితాలు మాత్రం అతనికి షాక్ ఇచ్చాయి.కమల్ హాసన్ పార్టీ తరపున పోటీ చేసిన వాళ్లు సైతం ఎన్నికల్లో ఓడిపోయారు.
అసెంబ్లీ ఎన్నికలు సినీ ప్రముఖులకు కలిసిరాలేదనే చెప్పాలి.