పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.అదికూడా ఫాం కోల్పోయే టైం లో అలాంటి అవకాశం వస్తే లక్కీ అన్నట్టే.
ప్రస్తుతం ఇలాంటి లక్కీ ఛాన్స్ అందుకుంది మళయాళ భామ నిత్యా మీనన్.మళయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుం కోషియం రీమేక్ గా ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా తెలుగు రీమేక్ లో పవన్, రానా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.అయితే ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుందని తెలుస్తుంది.
రానాకి జోడీగా ఐశ్వర్యా రాజేష్ ను ఫిక్స్ చేయగా పవన్ కు పెయిర్ గా నిత్యా మీనన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
పవర్ స్టార్ సినిమాలో నిత్యా అది లీడ్ పెయిర్ గా అంటే నిత్యా మీనన్ కు ఇది లక్కీ ఛాన్స్ అన్నట్టే.
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిత్యా మీనన్ తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.అయితే నటిగా తన మార్క్ చూపించిన ఈ అమ్మడు కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం ఇమేజ్ తెచ్చుకోలేదు.
అందుకే ఈమధ్య ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి.మరి పవన్ సినిమాతో అయినా మళ్లీ నిత్యా మీనన్ కు టైం కలిసి వస్తుందేమో చూడాలి.
తెలుగు అయ్యప్పనుం కోషియం సినిమాను పేరుకి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నా వెనక నడిపించేది అంతా త్రివిక్రం అని ఇండస్ట్రీ టాక్.