ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న విషయం తెలిసిందే.అయితే మన దేశంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడ క్రికెట్ అనే విషయం మనకు తెలిసిందే.
అయితే కరోనా విజృంభణతో ప్రజలందరూ మానసికంగా నెగెటివిటీని కలిగి ఉన్న పరిస్థితులలో క్రికెట్ అభిమానులకు కొంత ఊరట నిస్తున్న సాధనం ఐపీఎల్.అయితే అంతర్జాతీయ మ్యాచ్ లను అభిమానులు ఎంతలా అభిమానించారో, ఐపీఎల్ ని కూడా క్రికెట్ అభిమానులు అంతలా ఆదరించారు.
ఇక మన క్రికెటర్ లు సైతం మ్యాచ్ సమయంలో ఎంతలా విజృంభిస్తారో, మ్యాచ్ అనంతరం రకరకాల కార్యక్రమాలతో అభిమానులను అలరించారు.అయితే ఐపీఎల్ ను సామాన్య అభిమానులే కాక సెలెబ్రెటీలు సైతం ఐపీఎల్ ను ఇష్టపడతారు.
అయితే తమ అభిమాన నటులకు ఏ టీం అంటే ఇష్టమో అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది.అయితే తాజాగా రష్మిక మందన తన అభిమానులతో కలిసి ఇంస్టాగ్రామ్ లో లైవ్ చాట్ నిర్వహించింది.
అయితే ఈ సందర్భంగా ఓ అభిమాని మీకిష్టమైన అభిమాన ఐపీఎల్ టీం ఏంటి అని ఆడగగా అభిమాని ప్రశ్నకు రష్మిక సమాధానమిచ్చింది.నాకు ఇష్టమైన ఐపీఎల్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ అని తెలిపింది.
అయితే ఇప్పుడు నెట్టింట్లో ఈ వార్త వైరల్ అవుతోంది.