రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.ఈయన గురించి తెలియని తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈయన మాస్ పాటలకు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు.
టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవి శ్రీ ఒకరు.ఈయన టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా మంచి మంచి సాంగ్స్ అందించాడు.
ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ బాలీవుడ్ లో బిజీ అయ్యాడు.తాజాగా ఈయన కంపోజ్ చేసిన ‘సీటిమార్‘ సాంగ్ కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది.ఈ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో మరిన్ని అవకాశాలు ఆయనను వెతుకుంటూ వచ్చాయి.ఈ సాంగ్ హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో అందరి చూపు ఈయనపై పడింది.
అందుకే వరస ఆఫర్లు ఇస్తూ దేవి శ్రీ ని బిజీ చేసారు.
బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘రాధే‘ సినిమా లో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో సూపర్ హిట్ అయిన అల్లు అర్జున్ ‘సీటిమార్ సాంగ్’ ను ‘రాధే’ సినిమా కోసం సల్మాన్ ఖాన్ ఉపయోగించు కున్నాడు.తెలుగులో కూడా ఈ సాంగ్ కు దేవి శ్రీ ప్రసాద్ నే సంగీతం అందించారు.
ఈ పాట విడుదల అయ్యే ఇప్పుడు బాలీవుడ్ లో మార్మోగుతుంది.దీంతో దేవి కి మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
తాజాగా రణ్వీర్ నటిస్తున్న ద్విపాత్రాభినయం సినిమా ‘సర్కస్‘ లో రెండు పాటలు చేసేందుకు దేవి శ్రీ ప్రసాద్ కు అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది.ఈ సినిమాను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో పూజ హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాడజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుంది.ఆ సాంగ్ కే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించ బోతున్నాడు.ఈ సాంగ్ లో దీపికా ఆడి పాడనుంది.