సినీ ఇండస్ట్రీలో కొందరు నటీనటులు సినిమా తర్వాత కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు.ఇప్పటికీ కొందరు నటీనటులు తమ స్నేహబంధం ను అలాగే కొనసాగించగా.
తనకు జలుబు వస్తే ఎన్టీఆర్ చేసిన సేవల గురించి ఓ హీరోయిన్ తాజాగా అభిమానులతో పంచుకుంది.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.
అలనాటి తార జయప్రద.
తెలుగు సినీ పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న జయప్రద.తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఇక ఈమె స్టార్ హీరో సీనియర్ ఎన్టీఆర్ తో నటించగా తనకు ఆయనతో ఉన్న స్నేహ బంధం గురించి తెలిపింది.
తను తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో సిని ఇండస్ట్రీకి పరిచయమైందట.
తను చూసిన తిలక్ ‘భూమికోసం‘ నటించడానికి అడిగారట.ఇక అప్పట్లోనే తనకు ఎన్టీఆర్ అంటే పిచ్చి ప్రేమ ఉండేదని, కానీ ఎప్పుడు తన ఆటోగ్రాఫ్ కూడా తీసుకోలేదని తెలిపింది.
చిన్నతనం నుంచి తనకు కాస్త సిగ్గు ఎక్కువగా ఉండేదట.తను డాక్టర్ కావాలనుకుందట.
కానీ యాక్టర్ అయ్యానని తెలిపింది.తను సినిమాల్లో ఏ డైలాగ్ అయినా చెప్పడంలో, వారితో ధైర్యంగా మాట్లాడాలి అంటే తనకు కుదిరేదికాదట.
తాను ప్రతి దానికి విరుద్ధంగా ఉంటూ తన లర్నింగ్ ప్రాసెస్ కూడా ఇంటెన్సివ్ గా ఉండేదని తెలిపింది.
ఇక తన నటన పట్ల అందరూ తనని అర్థం చేసుకునే వారట.చంటి బిడ్డకు ఎలా నేర్పిస్తారో అలానే నేర్పేవారట.అందరూ తనకు తండ్రితో సమానం అని తెలిపింది.
తను 14 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు వాళ్ళు 50 ఏళ్లు ఉండేవారట.ఇక తనను చిన్నపిల్లలగా చేసుకునే వారట.
ఇక తనకు ఎప్పుడైనా జలుబు వస్తే ఎన్టీఆర్ ఇంటి నుండి తారకం తనకు శొంఠి పాలు పంపేదట.ఎన్టీఆర్ ఎప్పుడు షూటింగ్ సమయంలో జ్యూస్ తాగే వాడని తెలిపింది.అంతేకాకుండా తనతో కూడా తగ్గించే వారని తెలిపింది.ఆమె చాలా తక్కువగా తినడంతో ఆమే మీద ఎంతో కేర్ తీసుకునేవాడట ఎన్టీఆర్.
అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ తనను దగ్గర కూర్చోబెట్టుకొని హిందీ డైలాగులు నేర్పేవారట.ఇలా ప్రతి ఒక్కరు తనతో ఎంతో సన్నిహితంగా ఉండేవారని తెలిపింది.
అంతేకాకుండా తనతో కొందరు హీరోలు ఎలా ఉండేదో, ఎలా చూసుకునే వాళ్ళో తెలుపుకొచ్చింది జయప్రద.