నాగార్జున సాగర్‌లో సత్తా చాటుతున్న గులాబి పార్టీ.. !

తెలంగాణలోని నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకస్మిక మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుమారుడు నోముల భగత్ కి టిఆర్ఎస్ టికెట్ ఇచ్చి బరిలో దింపింపిన విషయం తెలిసిందే.కాగా ఇదే స్దానం నుండి కాంగ్రెస్, బీజేపీ కూడా తమ అభ్యర్ధులను బరిలోకి దింపాయి.

 Trs Candidate Nomula Bhagath Leading In Nagarjuna Sagar By Polls , Trs Candiate,-TeluguStop.com

అయితే ప్రచారం మొదలు పెట్టినప్పటి నుండి ఇక్కడి గెలుపు పై ప్రజల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది.దీనికి తగ్గట్టుగానే ప్రచారం కూడా హోరాహోరిగా సాగిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా ఈ రోజు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, తొలి రౌండ్ తో పాటుగా రెండు, మూడు, నాలుగు రౌండ్స్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తానికి సాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు ఖాయమని అర్ధం అవుతుంది.

ఇక తాజా సమాచారం ప్రకారం 9వ రౌండ్ ముగిశాక టీఆర్ఎస్ కు 32,598 ఓట్లు, కాంగ్రెస్ కు 24,487 ఓట్లు పోలయ్యాయని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube