తెలంగాణలోని నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకస్మిక మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుమారుడు నోముల భగత్ కి టిఆర్ఎస్ టికెట్ ఇచ్చి బరిలో దింపింపిన విషయం తెలిసిందే.కాగా ఇదే స్దానం నుండి కాంగ్రెస్, బీజేపీ కూడా తమ అభ్యర్ధులను బరిలోకి దింపాయి.
అయితే ప్రచారం మొదలు పెట్టినప్పటి నుండి ఇక్కడి గెలుపు పై ప్రజల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది.దీనికి తగ్గట్టుగానే ప్రచారం కూడా హోరాహోరిగా సాగిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఈ రోజు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, తొలి రౌండ్ తో పాటుగా రెండు, మూడు, నాలుగు రౌండ్స్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తానికి సాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు ఖాయమని అర్ధం అవుతుంది.
ఇక తాజా సమాచారం ప్రకారం 9వ రౌండ్ ముగిశాక టీఆర్ఎస్ కు 32,598 ఓట్లు, కాంగ్రెస్ కు 24,487 ఓట్లు పోలయ్యాయని సమాచారం.