ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడిపోతోంది.ఏదైనా ఆస్పత్రికి వెళ్లి చూస్తే అక్కడ కనిపిస్తుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.
కరోనా సెకండ్ వేవ్ ఎవర్నీ వదలట్లేదు.గుంపులుగా జనాన్ని ఆస్పత్రులకు లాక్కు పోతోంది.
అలాంటి కరోనాకి షాక్ ఇస్తున్నారు కొందరు.మానవత్వంతో మనసుల్నే కాదు కరోనాను కూడా గెలవొచ్చు అని వాళ్లు నిరూపిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్లాస్మా, బ్లడ్, ఆక్సిజన్, బెడ్స్, రెమ్డెసివిర్, మందులు కావాలని చాలా మంది అడుగుతున్నారు.కానీ వాటిని కొనేందుకు వారి దగ్గర డబ్బు లేదు.
అలాంటి పేదల్ని అదుకునేందుకు ముందుకొచ్చిన పెద్దాయన పాస్కల్ సల్దానా.మండపాలను డెకరేట్ చేసే ఆయన డబ్బున్నవాడేమీ కాదు.కానీ మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించాడు.ముంబైకి చెందిన ఆయన తన భార్య నగలు అమ్మి కరోనా పేషెంట్లకు ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్నాడు.
పాస్కల్ కళ్ల వెంట కన్నీళ్లు సుడిగుండాలయ్యాయి.భగవంతుడా అనుకున్నాడు.
ఆ క్షణం అతని నోట మాట రాలేదు.కాసేపటికి తేరుకున్నాడు.
ఆ దేవుడు నిన్న చల్లాగా చూస్తాడు అని బీరువా లోంచీ భార్య నగలు తెచ్చి వాటిని అమ్మి డబ్బు తెచ్చాడు.ఆ డబ్బుతో ఆక్సిజన్ సిలిండర్లు కొని అవసరమైన వారికి ఉచితంగా ఇస్తున్నాడు.
ఈ కథ తెలుసుకున్న నెటిజన్ల కళ్లు చమర్చుతున్నాయి.ఆ ఫ్యామిలీపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
నిజమైన సంపన్నుడంటే ఆయనే అని ఓ యూజర్ రాయగా, ఆయనకు హాట్సాఫ్ ఎందుకంటే… మండపాల వ్యాపారం కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతింది.అయినా అంతలా చేస్తున్నాడు” అని మరో యూజర్ మెచ్చుకున్నారు.“మానవత్వం బతికే ఉంది.పాస్కల్ సల్దానాకు హాట్సాఫ్” అని మరో యూజర్ తెలిపారు.“నిజమైన హీరో అంటే ఎవరో కాదు వీళ్లే” అని మరో యూజర్ మెచ్చుకున్నారు.