దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న కారణంగా ఇండియా నుండి వస్తున్న ప్రయాణీకులపైన ఆంక్షలు విధిస్తున్నాయి పలు దేశాలు.తమ దేశ పౌరులైనా సరే ఆంక్షలను విధిస్తున్నారు.
లేటెస్ట్ గా ఇజ్రాయెల్ కూడా ఇండియాకు తమ దేశ పౌరులు వెల్లకుండా నిషేధించింది.ఇజ్రాయెల్ ఆరోగ్య ఆదేశాల ప్రకారం మే 3 నుండి 16 వరకు భారత్ కు తమ దేశ ప్రజలు వెల్లకుండా ఆంక్సలు విధించింది.
భారత్ తో పాటుగా ఇజ్రాయెల్ మరికొన్ని దేశాల మీద ఈ ఆంక్షలు విధించింది.ఉక్రెయిన్, బ్రెజిల్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, టర్కీ దేశాలకు కూడా ఇజ్రాయెల్ పౌర్లు వెళ్లడానికి అవకాశం లేని విధంగా ఆంక్షలు విధించింది.
ఇజ్రాయెల్ పౌరులు కాని వారికి ఈ ఆంక్షలు వర్చినవని తెలుస్తుంది.ఈ ఏడు దేశాల నుండి వచ్చే తమ దేశ పౌరులు అక్కడకు వస్తే 14 రోజులు క్వారంటైన్ లో తప్పనిసరిగా ఉండాలని చెప్పారు.
ఇండియాలో కరోనా విజృంభిస్తున్న కారణంగా పలు దేశాలు తమ దేశ పౌరులను ఇక్కడకు రానివ్వకుండా ఆంక్షలను విధిస్తున్నారు.పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇండియాలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తుంది.ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా మరోపక్క కేసులు పెరుగుతున్నాయి.