తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వచ్చీరావడంతోనే స్టార్ హీరోలతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనుకోకుండా హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు.ఇందులో ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వం వహించిన “వరుడు” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన పంజాబీ బ్యూటీ “భానుశ్రీ మెహ్రా” కూడా ఈ కోవకే చెందుతుంది.
అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ లాంటి స్టార్ హీరోతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనివార్య కారణాలవల్ల హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.అయితే వరుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన అల్లు అర్జున్, భానుశ్రీ మెహ్రా ల పాత్రలకు మాత్రం సినీ విమర్శకుల నుంచి మార్కులు పడ్డాయి.
కానీ ఈ చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత అల్లు అర్జున్ కి వేదం, బద్రీనాధ్, తదితర చిత్రాలు హిట్ ఇవ్వడంతో మళ్ళీ తన కెరియర్ పుంజుకుంది.కానీ వరుడు చిత్రం ఫ్లాప్ తర్వాత భాను శ్రీకి మాత్రం సినిమా అవకాశాలు వరించలేదు.
దీంతో ఈ అమ్మడు ఒకానొక సమయంలో రెండో హీరోయిన్ మరియు కామియో, గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో కూడా నటించడానికి సిద్ధమైంది.అయినప్పటికీ తన సినిమా కెరీర్ లో మాత్రం నిలదొక్కుకోలేకపోయింది.
దీంతో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించింది.ఈ క్రమంలో 2018 వ సంవత్సరంలో కరణ్ అనే ప్రముఖ వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అయితే పెళ్లయిన తర్వాత కూడా భానుశ్రీ మెహ్రా అడపాదడపా చిత్రాలలో నటించింది.
ఈ మధ్యకాలంలో భానుశ్రీ మెహ్రా సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
ఇందులో భాగంగా తాజాగా ఈ అమ్మడు కొంతమేర క్లీవేజ్ షో తో గ్లామర్ డోస్ పెంచి ఫోటోలకి ఫోజులు ఇస్తోంది.దీంతో తొందర్లోనే భానుశ్రీ మెహ్రా మళ్లీ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కానీ ఇప్పటివరకు భానుశ్రీ మెహ్రా మాత్రం తన హీరోయిన్ రీ ఎంట్రీ పై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.కాగా ఆ మధ్య కీర్తి సురేష్ మెయిన్ లీడ్ పాత్రలో నటించిన మిస్ ఇండియా చిత్రంలో ఓ చిన్న పాత్రలో భానుశ్రీ మెహ్రా కనిపించింది.
ఏదేమైనప్పటికీ నటీనటుల జీవితాల్లో ఒక హిట్టు, ఫ్లాప్ ఎంత ముఖ్యమైనదో భానుశ్రీ మెహ్రా సినీ కెరియర్ ని చూస్తే బాగా అర్థమవుతుంది.