గతేడాది ఇదే సమయంలో దాదాపు లక్ష కరోనా కేసులు నమోదైతే ప్రజలు గజగజా వణికిపోయారు.కేంద్రం సైతం కరోనా వైరస్ కొత్త వైరస్ కావడంతో లాక్ డౌన్ తో పాటు కఠిన ఆంక్షలను అమలు చేసింది.
అయితే లాక్ డౌన్ నిబంధనల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా నష్టపోవడంతో ఈ సంవత్సరం లాక్ డౌన్ ను అమలు చేయడానికి కేంద్రం సిద్ధంగా లేదు.కరోనా సెకండ్ వేవ్ లో చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడగా అలా కరోనా సోకిన వాళ్లలో సమీరా రెడ్డి కూడా ఒకరు.
తాజాగా సమీరా రెడ్డికి కరోనా నెగిటివ్ నిర్ధారణ అయింది.కరోనా నెగిటివ్ రావడం గురించి స్పందించిన సమీరా రెడ్డి ఫ్యాన్స్ కు కీలక సూచనలు చేశారు.కరోనా నుంచి కోలుకున్నప్పటికీ స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆమె వెల్లడించారు.యోగా, వాకింగ్ చేయడం ద్వారా పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె వెల్లడించారు.
కరోనా వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను చూస్తే తన గుండె తరుక్కుపోతుందని ఆమె పేర్కొన్నారు.
తాను దాదాపు 60 రోజుల నుంచి ఫిట్ నెస్ ఫ్రైడేను ఫాలో అయ్యాయని అలా ఫాలో కావడం వల్ల తాను కరోనా నుంచి వేగంగా కోలుకోగలిగానని సమీరా రెడ్డి చెప్పుకొచ్చారు.
ప్రతి ఒక్కరు ఎక్సర్ సైజ్ చేయాలని ఎక్సర్ సైజ్ చేయడం ద్వారా కరోనాను జయించవచ్చని సమీరా రెడ్డి వెల్లడించారు.సింపుల్ వాకింగ్ చేయడం ద్వారా కూడా స్టామినాను పెంచుకోవచ్చని సమీరా రెడ్డి పేర్కొన్నారు.
బలహీనంగా ఉండటంతో తాను పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నానని సమీరా రెడ్డి చెప్పుకొచ్చారు.తనపై ప్రేమను చూపించిన అభిమానులకు తాను ఎంతగానో రుణపడి ఉంటానని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మాత్రమే సమస్యలను అధిగమించడం సాధ్యమవుతుందని సమీరా రెడ్డి అన్నారు.