బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.అందుకే ఈమెకు ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడింది.
ఈమెకు సంభంధం లేని విషయంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది.ఈమె ధాటికి పెద్ద పెద్ద హీరోలు కూడా కామ్ అయినా సందర్భాలు ఉన్నాయి.
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
తన సినిమాల విషయంలో కూడా అలాగే స్పందిస్తూ వివాదాలు చెలరేగేలా చేసి ఫ్రీ ప్రమోషన్స్ చేసుకోవడం ఈమె స్పెషాలిటీ.
ఈమె నటనకు ప్రాధాన్యం ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వరస హిట్లతో దూసుకు పోతుంది.ఈమె ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలు వేరే వాళ్ళు నిర్మించినవే.
కానీ ఈ మధ్య నిర్మాతలు ఈమె గొడవలు కారణంగా సినిమాలు చేయడానికి భయపడుతున్నారు.
అందుకే కంగనా తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించింది.తాను నటించిన మణికర్ణిక సినిమా పేరును తన నిర్మాణ సంస్థకు పెట్టింది.ఇక నుండి ఈ బ్యానర్ లో సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.
ముందుగా తన నిర్మాణ సంస్థలో ఒక వెబ్ సిరీస్ ను నిర్మించనున్నట్టు తెలుస్తుంది.ఇప్పటి వరకు వేరే వాళ్ళు నిర్మించిన సినిమాల్లో చేయడం వల్ల కొద్దిగా తగ్గి మాట్లాడేది.
కానీ ఇప్పుడు తన సొంత నిర్మాణ సంస్థతో సినిమాలు చేయబోతుంది.కాబట్టి ఈమెను ఇంకా ఆపేవారే లేనంతగా రెచ్చిపోతుంది.
తన మాటలనే బాణాలుగా సందించడానికి రెడీగా ఉంది.ఇది ఇలా ఉండగా కంగనా ప్రస్తుతం జయలలిత బయోపిక్ గా రూపొందుతున్న తలైవి సినిమా చేస్తుంది.
ఈ సినిమాలో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా విడుదలకు సిద్దమైన కరోనా కారణంగా వాయిదా పడింది.