తెలుగులో పలు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ ఆర్టిస్ట్ “జ్యోతి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి జ్యోతి కేవలం నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు వ్యాంపు మరియు బోల్డ్ తరహా పాత్రలలో కూడా నటించి బాగానే అలరించింది.
కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ఇందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ చిత్రంలో తానూ నటించానని ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తన కోసం కవితలు కూడా రాసేవాడిని చెప్పుకొచ్చింది.
అయితే అప్పట్లో ఆ విషయం పెద్దగా అనిపించక పోయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులలో మరోసారి పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వస్తే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.అలాగే సినిమాల్లో నటించాలంటే తనకి రెమ్యునరేషన్ లేదా మరే ఇతర అంశాల కంటే ఆ పాత్రకి తాను సూటవుతానా.? లేదా…? అనే అంశం తనకు చాలా ముఖ్యమని తెలిపింది.
అయితే గతంలో తాను టాలీవుడ్ ప్రముఖ స్వర్గీయ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన తొట్టి గ్యాంగ్, ఎవడి గోల వాడిది, తదితర చిత్రాలలో నటించానని ఆ నమ్మకంతోనే కితకితలు చిత్రంలో నటించడానికి అంగీకరించానని తెలిపింది.కానీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మాత్రం తాను సినిమా లొకేషన్ లోకి వెళ్లే వరకు తన పాత్ర ఎలా ఉంటుందనే విషయం తెలియజేయలేదని అందువల్ల సినిమా షూటింగ్ లొకేషన్ కి వెళ్ళినప్పుడు పైట విప్పి మంచంపై పడుకోమని డైరెక్ట్ గా తనతో చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కయ్యానని తెలిపింది.ఆ సమయంలో తాను అలాంటి సన్నివేశంలో నటించనని దర్శకుడి మొహం మీదే చెప్పేసి సినిమా షూటింగ్ స్పాట్ నుంచి వెళ్ళిపోయానని తెలిపింది.
దాంతో ఇక అప్పటి నుంచి తాను ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలలో నటించ లేదని కూడా స్పష్టం చేసింది.
అయితే తనకు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణపై ఎలాంటి కోపం లేదని కానీ ఒక నటి లేదా నటుడు ఏదైనా ఒక పాత్రలో నటిస్తే ఆ పాత్ర యొక్క ప్రభావం తరతరాలు ఉండిపోతుందని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
అలాగే భవిష్యత్తులో ఆ పాత్రని తన కూతురు లేదా కొడుకు ఎవరైనా చూసి అసభ్యకరంగా కామెంట్ చేసే విధంగా ఉండకూడదని అందువల్లనే తాను అలాంటి సన్నివేశంలో నటించనని చెప్పి వచ్చేసానని చెప్పుకొచ్చింది.