ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమ మైకంలో మునిగిపోయి వాస్తవాలు తెలుసుకోకుండా చేసేటటువంటి పనుల కారణంగా చిక్కుల్లో పడుతున్నారు.కాగా తాజాగా ఓ యువతి సోషల్ మీడియా మాధ్యమాలలో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడి సర్వం అర్పించింది.
చివరికి ఆ వ్యక్తి కి కాస్త ఇదివరకే పెళ్లయి పిల్లలు ఉండడంతో పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని పోలీసులను సంప్రదించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన సంధ్య (పేరు మార్చాం) అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటోంది.
అయితే ఈ మధ్య కాలంలో సంధ్య కాలక్షేపం కోసం సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే ఉపయోగించేది.ఈ క్రమంలో ఇదే రాష్ట్రానికి చెందిన ఓ పోలీసు ఉద్యోగి తో పరిచయం ఏర్పడింది.
దీంతో ఈ మధ్య ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.ఈ క్రమంలో సంధ్య తన పుట్టింటికి లేదా ఇతర కారణాలతో బయటకు వెళ్తున్నానని చెప్పి ఆ పోలీసు ఉద్యోగిని కలుసుకుంటూ ఉండేది.
దీంతో సంధ్యపోలీసు ఉద్యోగికి సర్వం ఆర్పించింది.అయితే మోజు తీరిపోయిన తర్వాత ఆ పోలీసు ఉద్యోగి సంధ్యతో మాట్లాడడం కూడా మానేశాడు.
దీంతో తాజాగా మరోమారు సంధ్య తనను పెళ్లి చేసుకోవాలని తన ప్రియుడి పై ఒత్తిడి తెచ్చింది.దీంతో పెళ్లి పోరు భరించలేక సంధ్య ప్రియుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంధ్య ని స్థానిక రాష్ట్రంలోని కరీం నగర్ జిల్లాలో కొంతకాలం పాటు ఇల్లు అద్దెకు తీసుకొని అందులో ఉంచాడు.
అయినప్పటికీ పెళ్లి కి మాత్రం ఒప్పుకోవడం లేదు.దీంతో సంధ్య తన ప్రియుడి గురించి ఆరా తీయగా ఇదివరకే పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నట్లు తెలుసుకుంది.దీంతో తనకు న్యాయం చేయాలంటూ సదరు పోలీసు అధికారులను కోరింది.