ప్రపంచ యుద్ధం జరగలేదు.బాంబులు పేలలేదు.
రక్తం చుక్క కూడా చిందడం లేదు.కానీ భారతదేశం శ్మశానం అవుతుంది.
ఉగ్రవాద దాడులు జరగడం లేదు కానీ ఆ ఉగ్రవాదులకంటే భయంకరమైన కంటికి కనిపించని కరోనా అనే వైరస్ చేస్తున్న విధ్వంసం వల్ల ప్రాణం విలువ అర్ధం అవుతుంది.
ఈ కరోనా సోకితే అంటరాని వారిలా చూస్తున్న సమాజాన్ని చూస్తుంటే మానవత్వం సిగ్గుపడుతుంది.
ఆదుకోవలసిన చేతులే అన్యాయంగా కరోనా పేరు చెప్పుకుని దోపిడికి పాల్పడుతుంటే ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నందుకు సిగ్గుపడవలసిన పరిస్దితులు తలెత్తాయి.
ఇకపోతే కోవిడ్ వల్ల చిత్రపరిశ్రమ కుదేలవుతున్న విషయాన్ని గమనించే ఉంటారు.
అందులో వరుసగా మరణాలు కూడా చోటు చేసుకోవడం విషాదం.ఇలాంటి విషాద ఘటనే టాలీవుడ్ లో చోటు చేసుకుంది.
కరోనాతో యంగ్ డైరెక్టర్ కుమార్ వట్టి(39) చికిత్స పొందుతూ కన్నుమూశారు.కాగా పరుశురాం వద్ద యువత సినిమా కోసం కుమార్ వట్టి పని చేశారు.ఆ తర్వాత సోలో సినిమాకు కూడా పనిచేశారు.ఇకపోతే శ్రీవిష్ణు హీరోగా 2017లో మా అబ్బాయి అనే సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు.ప్రస్తుతం సర్కారు వారీ పాట సినిమాకు అసోసియేట్గా పనిచేస్తున్న కుమార్ వట్టి మరణం టాలీవుడ్ చిత్రపరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది.