జగన్ రాజకీయ ప్రస్తావనలో మొదటి నుండి మద్దతు తెలుపుతున్న వారిలో రెహమాన్ ఒకరు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన సమయం నుండి రెహమాన్ ఎప్పుడు జగన్ వెంటే ఉన్నారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి గా వ్యవహరిస్తున్న ఆయన కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
చికిత్స నిమిత్తం హైదరాబాదులో ఆసుపత్రిలో జాయిన్ అవ్వవా ఈరోజు మధ్యాహ్నం మృతి చెందటంతో వైసీపీ పార్టీ నేతలు సంతాపం తెలిపారు.
ముఖ్యంగా వైఎస్ జగన్ రెహ్మాన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ఎన్నో సేవలు రెహమాన్ అందించారు అని పేర్కొన్నారు.
ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది అంటూ కుటుంబ సభ్యులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఒక్క వైయస్ జగన్ తో మాత్రమే కాక వైయస్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి.
గతం వైసీపీ ఎమ్మెల్సీ గా కూడా పనిచేశారు.
.