తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు యంగ్ హీరో నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన “హార్ట్ ఎటాక్” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం ముంబై బ్యూటీ “ఆదా శర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే మంచి హిట్ అందుకోవడంతో వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.
కానీ ఈ క్రమంలో కథల పట్ల కొంత మేర అవగాహన లోపించడంతో ఈ అమ్మడిని సినిమా కెరియర్ చిక్కుల్లో పడింది.
అంతేకాకుండా అప్పటి వరకు హీరోయిన్ గా నటించిన ఆదా శర్మ ఒక్కసారిగా రెండో హీరోయిన్ మరియు గెస్ట్ అప్పియరెన్స్ తదితర పాత్రలో నటించడంతో ఈ అమ్మడి హీరోయిన్ పూర్తిగా ఇబ్బందుల్లో పడింది.
కాగా ఇలా నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సన్నాఫ్ సత్య మూర్తి, చిత్రాలు పర్వాలేదనిపించినప్పటికీ ఈ అమ్మడికి సినిమా అవకాశాలు మాత్రం తెచ్చి పెట్టలేక పోయాయి.దీంతో మూట ముల్లె సర్దుకొని ముంబైకి వెళ్ళిపోయింది.
ఈ క్రమంలో తెలిసిన వారి ద్వారా బాలీవుడ్ ప్రముఖ హీరో విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించిన కమాండో చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది.దీంతో ప్రస్తుతం ఆదా శర్మ పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఘాటుగా అందాలను ఒలకబోస్తూ ఉంది.
అయినప్పటికీ సినిమా ఆఫర్లు మాత్రం వరించడం లేదు.
కాగా ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో “సోల్ సాతి” అనే షార్ట్ ఫిలింలో నటిస్తోంది.
అలాగే “పతి పత్ని ఔర్ బంగా” అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫారం అయిన ఎంఎక్స్ ప్లేయర్ లో ప్రసారమవుతుంది.
ఏదేమైనప్పటికీ కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఈ అమ్మడు కథల పట్ల మరియు తన పాత్రల పట్ల సరైన నిర్ణయం తీసుకోకపోవడమే ఈ అమ్మడి కెరియర్ ముగిసిపోవడానికి కారణం అయిందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.