పులి తోకను చూసి పిల్లి తోక అని భ్రమపడినట్లుగా ఉందట తెలంగాణ ప్రజల పరిస్దితి.ఎందుకంటే కరోనా విషయంలో ఒకోక్కరి మాటలకు పొంతనలేకుండా ఉందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ పై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.
కె.అరుణ సంచలన ఆరోపణలు చేశారు.
తనకు పదవీ గండం ఉందని వస్తోన్న వార్తలకు భయపడి, తన పదవి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నాడని, ఈ మాటలు వింటే ఆయన మానసిక ఆరోగ్యంపై అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు.
రాష్ట్ర పరిస్దితుల పై గడియకో మాట మార్చుతు తన గౌరవాన్ని తానే తగ్గించుకుంటున్నాడని, అదీగాక సీఎం కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవాలన్న సోయి తప్పితే కరోనా పరిస్థితిపై అవగాహనతో మాట్లాడినట్టు ఎక్కడా అనిపించలేదంటూ మాట్లాడారు అరుణ.
ఈటల మాటలు ఇదే తరహాలో కొనసాగితే సీనియర్ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన మీద ఉన్న గౌరవం, సానుభూతి పోయి ప్రజల మధ్య చులకన అవడం ఖాయం అంటూ ఎద్దేవ చేశారు.
ఇక ఈటల ప్రమేయం లేకుండా సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ ఇతర అధికారులే వ్యవహారం మొత్తం నడిపిస్తున్నారని, ఏదో ఉనికి కోసం ప్రతి రోజూ దవాఖానాల పొంటి తిరుగుతున్నారు కానీ కరోనా పరిస్థితిపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదని స్పష్టం అవుతోందంటూ విమర్శించారు డి.కె.అరుణ.ఇక ప్రజల కష్టాలను పక్కన పెట్టి ఇలా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం సరికాదన్న విషయాన్ని నేతలు గమనిస్తే మంచిదని ప్రజలు అనుకుంటున్నారట.