అంటే అన్నారు గానీ, పాలకుల తప్పులు లెక్కపెడుతున్న ప్రజలు తాము చేస్తున్న తప్పులను మాత్రం బాండ్ పేపర్లా భద్రంగా దాచుకుంటారు.అసలే కరోనా కాలకూట విషాన్ని చిమ్ముతుంటే జాగ్రత్తలు తీసుకోవలసింది పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇందుకు ఉదాహరణ ఇజ్రాయెల్లో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఘటన.
ఆ వివరాలు చూస్తే.ఉత్తర ఇజ్రాయెల్లోని ఓ పవిత్ర స్థలంలో వేలాది మంది యూదులు గుమిగూడిన ప్రాంతంలో ఒక్క సారిగా తొక్కిసలాట జరగడంతో సుమారుగా 28 మంది మరణించినట్టు వైద్య సిబ్బంది తెలియజేశారు.అంతే కాకుండా పెద్దమొత్తం లో గాయపడ్డారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వెల్లడించారు.
అయితే గత ఏడాది కరోనా కారణంగా ఇక్కడ ప్రార్ధనలు నిర్వహించడం కుదరలేదు.కాగా ఈ సంవత్సరం వ్యాక్సిన్ వచ్చిన నేపధ్యంలో కరోనా నిబంధనల మేరకు 10 వేల మంది రావడానికి అధికారులు అనుమతినిచ్చారు.
కానీ, అందుకు మూడు రెట్లు జనం రావడం తో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.