ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా, స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో చాలామంది హీరోలు, డైరెక్టర్లు కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నారు.అలా కష్టాలు అనుభవించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఎస్ జె సూర్య ఒకరు.
ఖుషి, నాని, కొమరం పులి సినిమాలకు ఎస్ జె సూర్య తెలుగులో దర్శకత్వం వహించారు.
ఖుషి సినిమా విడుదలై 20 సంవత్సరాలు అయిన సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎస్ జె సూర్య ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తమిళంలో ఖుషి సినిమా మొదట తెరకెక్కినప్పటికీ పవన్ కు విజయ్ కంటే ముందే కథ చెప్పానని సూర్య అన్నారు.కథపై ఉన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సూర్య వెల్లడించారు.
సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు టీకప్పులు కడిగానని సూర్య తెలిపారు.
సర్వర్ గా టేబుల్ ను ఏ విధంగా శుభ్రం చేశానో డైరెక్టర్ గా కూడా అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తాను ఈ స్థాయిలో ఉన్నానని సూర్య చెప్పుకొచ్చారు.తాను అనుకున్న టార్గెట్ ను అందుకోలేక పోవడం వల్లే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని సూర్య తెలిపారు.రాధామోహన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బొమ్మ అనే సినిమాలో ప్రస్తుతం తాను నటిస్తున్నానని సూర్య తెలిపారు.
తనకు విలన్ రోల్స్ లో నటించడం ఇష్టం లేదని ఆ కారణం వల్లే ఎవరైనా విలన్ రోల్స్ ఆఫర్ చేసినా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నానని సూర్య అన్నారు.టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే తనకు ముఖ్యమని సూర్య పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో సూర్య స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.