ఏపీ పలు ప్రమాద సంఘటనలకు నిలయంగా మారింది.ఇప్పటికే కమ్మేసిన కరోనా, ఊహించని వర్షాలతో జన జీవనం గతి తప్పగా, తరచుగా జరుగుతున్న గ్యాస్ లీకేజీ ఘటనలు కూడా ఎందరి ప్రాణాలో హరించాయి.
ఏవైపు నుండి ప్రమాదం పొంచి ఉందో గ్రహించడం చాలా కష్టమైన స్దితిలో ఇక్కడి ప్రజలు బ్రతుకుతున్నారట.
ఇకపోతే తాజాగా గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఆ వివరాలు చూస్తే.స్దానికంగా ఉన్న ఓ పూరి గుడిసెలో షార్ట్సర్క్యూట్ జరగడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.
కాగా ఈ ప్రమాదంలో 20 మేకలు సజీవదహనం అవ్వగా, ఆ ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయిందట.
దీంతో ఈ ప్రమాదం వల్ల సుమారుగా రూ.10 లక్షల ఆస్తి నష్టం కలిగిందని అంచన వేసారు ఇక ఈ అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన స్దానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు హుటాహుటిన ఘటనా స్థలానిక చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారట కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది…
.