తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని తూర్పు గానుగూడెం గ్రామంలో జనసేన నాయకుడు గల్లా రంగాతో సహా పలువురు పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
కాగా ఈ ఘటన పై స్పందించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, వైసీపీ పై పలు సంచలన ఆరోపణలు చేశారట.
కాగా స్థానికంగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన జనసేన మద్దతు దారులపై గ్రామాల్లో వైసీపీ నాయకులు దాడులకు దిగుతున్నారని, జనసేన గెలుపును ఓర్వలేకే ఈ దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు.
ఈ దాడుల వెనుక వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని తెలిపిన పోలీసుల నుండి స్పందన కరువైందని, కాబట్టి ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ విన్నవిస్తున్నారు.
ఇకపోతే ఏపీలో టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం ఏదో ఒక రూపంలో సాగుతున్న విషయం విదితమే.