వైసీపీ పై నాదెండ్ల మనోహర్‌ సంచలన ఆరోపణలు.. ?

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని తూర్పు గానుగూడెం గ్రామంలో జనసేన నాయకుడు గల్లా రంగాతో సహా పలువురు పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

 Nadendla Manohar Sensational Allegations Against Ycp, Ap, Janasena, Nadendla Man-TeluguStop.com

కాగా ఈ ఘటన పై స్పందించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, వైసీపీ పై పలు సంచలన ఆరోపణలు చేశారట.

కాగా స్థానికంగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన జనసేన మద్దతు దారులపై గ్రామాల్లో వైసీపీ నాయకులు దాడులకు దిగుతున్నారని, జనసేన గెలుపును ఓర్వలేకే ఈ దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు.

ఈ దాడుల వెనుక వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని తెలిపిన పోలీసుల నుండి స్పందన కరువైందని, కాబట్టి ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్‌ విన్నవిస్తున్నారు.

ఇకపోతే ఏపీలో టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం ఏదో ఒక రూపంలో సాగుతున్న విషయం విదితమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube