ఆస్ట్రేలియన్ ప్రస్తుత క్రికెటర్ పెట్ కుమ్మిన్స్ ఇండియాలో కరోనా వైరస్ కట్టడి కోసం సీఎం ఫండ్ కి భారీగా 30 లక్షలకు పైగానే విరాళం ప్రకటించడం తెలిసిందే.దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో .
కరోనా రోగులు అనేక అవస్థలు పడుతున్నారు.బెడ్లు దొరకక ఆక్సిజన్ కొరతతో అనేకమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇలాంటి తరుణంలో ప్రపంచంలో మిగతా దేశాలు ఇండియాని ఆదుకోవడం కోసం తమ వంతు గా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ మాజీ బౌలర్ బ్రెట్ లీ కూడా ఇండియాని ఆదుకోవడానికి తనవంతుగా 42 లక్షల రూపాయలు విరాళం ప్రకటించాడు.ముఖ్యంగా తన విరాళం ప్రజల ఆక్సిజన్ కొరత తీర్చడానికి ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.అంతేకాకుండా ఇండియా తమకు రెండో దేశం లాంటిదని .భారత్ పై తన ప్రేమను చాటుకున్నాడు.దీంతో సోషల్ మీడియాలో బ్రెట్ లీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
అసలైన కీలక సమయంలో దేశంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగి హీరోల కంటే ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
.తాజా వార్తలు