ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ లో సత్తా చాటాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ.కార్పొరేషన్ ఎలక్షన్స్ ప్రచారంలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క విసృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు.
అధికార పార్టీని టార్గెట్ చేస్తూ భట్టి విక్రమార్క ప్రచార పర్వం నడిచింది.అధికార పార్టీ చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి ఏమి లేకనే బెదిరింపులకు పాల్పడుతుందని అన్నారు భట్టి.
కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి ఎన్నో చూసిందని.కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఖమ్మం ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిచేలా చేస్తారని అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్ధులు పోటీ చేస్తున్న అన్ని డివిజన్లలో భట్టి ప్రచారం చేశారు.
రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీ.ఆర్.ఎస్ పార్టీ ఖమ్మానికి ఏం తెచ్చిందని అన్నారు.ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మంజూరు చేయలేదని విమర్శించారు భట్టి.కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైం లో చేసిన అభివృద్ధినే గులాబీ పార్టీ చేసిందని చెప్పుకుంటున్నారని.కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాల్లో గెలిపిస్తారని భట్టి విక్రమార్క అన్నారు.ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం కూటమి కలిసి బరిలో దిగుతుంది.
కాంగ్రెస్ నుండి 47 మంది అభ్యర్ధులు, టీడీపీ 8, సీపీఎం 10 స్థానాల్లో పోటీ చేస్తుంది.అధికార పార్టీ టీ.ఆర్.ఎస్ 56 మంది పోటీ చేస్తుండగా టీ.ఆర్.ఎస్ తో కలిసి బరిలో దిగుతున్న సీపీఐ నుండి ముగ్గురు అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.