తెలంగాణ రాజకీయాలలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి.కొన్ని కొన్ని సార్లు ప్రజలకు ఇబ్బెట్టుగా కూడా అనిపిస్తాయి.
కాని రాజకీయాలు ఎలా ఉన్నా పార్టీలకు అతీతంగా కొందరు రాజకీయ నాయకులను ప్రజలు అవచ్చు, ఇతర పార్టీల నాయకులు కూడా ఇష్టపడతారు.అలా కొద్ది మంది నాయకులు మాత్రమే మనకు కనిపిస్తారు.
అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు.వారెవరో కాదు ములుగు ఎమ్మెల్యే సీతక్క.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క ను పార్టీలకతీతంగా అందరు నాయకులు గౌరవిస్తారు.కోవిడ్ సమయంలో గిరిజన బిడ్డలకు సహాయం చేయడానికి అడవుల్లో నడుచుకుంటూ వెళ్లి వారిని ఆదుకున్న తీరు దేశం మొత్తం ఆకర్శించింది.
అయితే కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా సమస్యలపై పోరాడటంలో సీతక్కకు ప్రత్యేక శైలి ఉంది.క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను యధాతథంగా ప్రభుత్వం దగ్గర ప్రస్తావిస్తూ ఆ సమస్య పరిష్కరించే వరకు వదలని నైజం సీతక్కది.
అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజ్రుభిస్తుందో మనం చూస్తున్నాం.అయితే ఈ నిరుపేదలకు కరోనా సోకితే ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్లలేక ఆర్థిక స్థోమతను భరించలేక పోతున్నారని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ముందు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
మరి ప్రభుత్వం కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చుతుందో లేదో అని అభిప్రాయ పడుతున్నారు.