ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇటువంటి కీలక టైంలో సలహాలు ఇవ్వాల్సింది పోయి శవ రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు అంటూ.
రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్లు కొరతపై ఆయన చేసిన వ్యాఖ్యలపై నాని మండిపడ్డారు.రాష్ట్రంలో ఆక్సిజన్ మరియు బెడ్లు కొరత తీర్చడానికి ఇతర రాష్ట్రాల నుండి.
తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.ఆక్సిజన్, బెడ్ల కొరత కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయా.
అంటూ మండిపడ్డారు.
ఆసుపత్రిలో సామర్థ్యం కంటే ఎక్కువమంది పేషెంట్లకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల నుండి ఆక్సిజన్ తేప్పిస్తున్నట్లు.క్లారిటీ ఇచ్చారు.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రాష్ట్రంలో అధికంగా ఉందని… కరోనా తన రూపు మార్చుకుని.భయంకరంగా మానవ శరీరం పై దాడి చేస్తుందని పేర్కొన్నారు.
పైగా గతంలో ఆక్సిజన్ అవసరం అనేది పెద్దగా ఉండేది కాదు, లక్షణాలు కూడా బయటపడేవి.కానీ ప్రస్తుతం ఆ విధంగా కాకుండా ఐదు రోజులకే… ఊపిరితిత్తుల్లో అనేక రీతులుగా .లక్షణాలు కనిపించకుండా ఈ వైరస్ దాడి చేస్తుందని అన్నారు.అయినా కానీ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వం .శక్తిమేరకు మోనిటరింగ్ చేస్తుంది అని స్పష్టం చేశారు.పైగా ప్రజలలో కరోనా వచ్చిన ప్రారంభంలో ఉన్న భయం.తర్వాత లేకపోవడం.కూడా వైరస్ వ్యాప్తికి ఒక కారణమని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
ఇలాంటి క్లిష్ట సమయంలో ఎక్కడ శవం దొరికితే దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో.చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని.మంత్రి సీరియస్ కామెంట్లు చేశారు.